ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యాపారి దారుణ హత్య.. స్థిరాస్తి గొడవలే కారణమా? - నరసరావుపేట వార్తలు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు స్థిరాస్తి వ్యాపారిని కత్తులతో నరికి చంపేశారు. రావిపాడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు వెంగమాంబ మల్లిఖార్జునరావుగా పోలీసులు గుర్తించారు

స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్య
murder

By

Published : Jul 7, 2021, 8:57 AM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. రావిపాడు సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్య గురయ్యాడు. మృతుడు స్థిరాస్తి వ్యాపారి వెంగమాంబ మల్లిఖార్జునరావుగా గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు మల్లిఖార్జునరావును దారుణంగా కత్తులతో నరికి చంపారు. స్థిరాస్తి వ్యాపారంలో గోడవలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details