ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

murder: దొంగ సొత్తు పంపకాల్లో వివాదం.. ఒకరి హత్య - 8 attack on men news

murder
murder

By

Published : Jul 31, 2021, 5:23 PM IST

Updated : Jul 31, 2021, 9:22 PM IST

17:17 July 31

కత్తుల దాడిలో వ్యక్తి మృతి

గుంటూరు జిల్లాలో దొంగలముఠాలో ఏర్పడిన వివాదం ఒకరి హత్యకు దారితీసింది. కర్లపాలెం మండలం సత్యవతి పేటకు చెందిన సాగర్ రెడ్డిని ఇవాళ సాయంత్రం కొందరు కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. 

అతని స్నేహితులే సాగర్ రెడ్డిని చంపినట్లు పోలీసులు తెలిపారు. సాగర్ రెడ్డి దొంగతనాలు, గంజాయి రవాణాతో పాటు నేరాలకు పాల్పడుతుంటాడు. అతనిపై గుంటూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. దొంగసొత్తు పంపకాల్లో అదే ముఠాలోని బడేసాబ్ అనే వ్యక్తితో సాగర్ రెడ్డికి విభేదాలు వచ్చాయి. దీంతో బడేసాబ్ మరికొందరితో కలిసి సాగర్​ను హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. మొత్తం 8మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:అనుమతి తీసుకోకపోవడం వల్లే గృహనిర్బంధం: హోం మంత్రి సుచరిత

Last Updated : Jul 31, 2021, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details