ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 30, 2019, 7:11 PM IST

ETV Bharat / state

ఎస్సీ వర్గీకరణ కోరతూ మహిళల ధర్నా

ఎస్సీ వర్గీకరణ కోరతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు. గుంటూరు జిల్లానుంచి ఛలో అసెంబ్లీకి వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసు స్టేషన్​ నిరసన చేస్తున్న మహిళలు

పోలీసు స్టేషన్​లో​ నిరసన చేస్తున్న మహిళలు

ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న 8 మంది మహిళా ఎమ్​ఆర్​పీఎస్​ కార్యకర్తలను తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం వద్ద అనుమతి లేదంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరావతి పోలీసు స్టేషన్​కి తరలించారు. తమను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ మహిళా కార్యకర్తలు పోలీసు స్టేషన్​లో ఆందోళనకు దిగారు.

ABOUT THE AUTHOR

...view details