ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై.. ఎంపీ మోపిదేవి హర్షం - నగరం, నిజాంపట్నం మండలాల్లో గెలిచిన సర్పంచిలతో ఎంపీ మోపిదేవి సమావేశం

గుంటూరు జిల్లా పరిధిలో సర్పంచ్​లుగా విజయం సాధించిన తమ వర్గం అభ్యర్థులతో.. ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రజలు.. 95 శాతం తమకే అనుకూలంగా ఓట్లు వేశారని హర్షం వ్యక్తం చేశారు.

mp mopidevi met winning sarpanches at guntur
గెలిచిన సర్పంచి అభ్యర్థులతో ఎంపీ మోపిదేవి నిజాంపట్నంలో సమావేశం

By

Published : Feb 10, 2021, 8:35 PM IST

తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు.. సీఎం జగన్ పరిపాలనకు ఇచ్చిన మద్దతని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. గుంటూరు జిల్లా నగరం, నిజాంపట్నం మండలాల పరిధిలో సర్పంచిగా గెలుపొందినవారు.. ఎంపీ కలిశారు.

మిగిలిన విడతల పంచాయతీ పోరుతో పాటు త్వరలో జరగనున్న ఎంపీటీసీ, మునిసిపాలిటీ ఎన్నికల్లోనూ ఇలాంటి తీర్పే ప్రజలు ఇస్తారనడంలో సందేహం లేదని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్ష నేతలు ఎస్​ఈసీ ద్వారా ఎన్నో విధాలుగా ప్రయత్నించినా.. ప్రజలు వైకాపాకు అండగా ఉన్నారని ఎంపీ పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details