గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరగటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని కంటైన్మెంట్ జోన్లలో ఉండే నివాసితులు ఎవరూ బయటకు రాకుండా ఆ ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఏ అవసరం ఉన్నా..గుంటూరు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఆరు కమాండ్ కంట్రోల్ రూములకు ఫోన్ చేసి తెలియజేయాలని నగర కమిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలవారు అత్యధికంగా నిత్యవసరాలు కావాలని కోరుతూ ఫోన్లు చేస్తున్నారు. ఆ తర్వాత కరోనా అనుమానితులకు సంబంధించిన ఫోన్లు వస్తున్నట్లు సమాచారం. ప్రతి కంటైన్మెంట్ జోన్లో నిత్యావసరాలు, కూరగాయలు విక్రయించాలని నగర కమిషనర్ మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు.
కంటైన్మెంట్ జోన్ పరిధిలో నిత్యావసరాలకే అత్యధిక కాల్స్ - గుంటూరులో కరోనా కేసులు
గంటూరు నగరంలో కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో అధికారులు కట్టదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఎవరూ బయటకు రాకుండా నిత్యావసరాలను అధికారులు ఇళ్ల వద్దకే సరఫరా చేస్తున్నారు.
![కంటైన్మెంట్ జోన్ పరిధిలో నిత్యావసరాలకే అత్యధిక కాల్స్ నిత్యవసరాలకే అత్యధిక కాల్స్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6771145-473-6771145-1586758813592.jpg)
నిత్యవసరాలకే అత్యధిక కాల్స్