ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వచ్చే 35 ఏళ్ల వరకు ఉచిత విద్యుత్​కు ఢోకా లేదు: ఎమ్మెల్సీ డొక్కా - ఏపీలో ఉచిత విద్యుత్​కు నగదు బదిలీ వార్తలు

ఉచిత విద్యుత్​ పథకానికి నగదు బదిలీతో ఎలాంటి నష్టం లేదని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. వచ్చే 35 ఏళ్ల వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్​కు ఢోకా లేదని స్పష్టం చేశారు.

mlc dokka manikya varaprasad
mlc dokka manikya varaprasad

By

Published : Sep 12, 2020, 5:32 PM IST

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్​ పొందటం రైతుల హక్కు అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. దివంగత సీఎం వైఎస్​ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత మెరుగైన రీతిలో సీఎం జగన్ అమలు చేస్తున్నారని అన్నారు. వచ్చే 35ఏళ్ల వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్​కు ఢోకా ఉండదని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ చేయడంతో ప్రభుత్వానికి బాధ్యత, రైతుకు జవాబుదారీతనం వస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details