వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ పొందటం రైతుల హక్కు అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత మెరుగైన రీతిలో సీఎం జగన్ అమలు చేస్తున్నారని అన్నారు. వచ్చే 35ఏళ్ల వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు ఢోకా ఉండదని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ చేయడంతో ప్రభుత్వానికి బాధ్యత, రైతుకు జవాబుదారీతనం వస్తుందన్నారు.
వచ్చే 35 ఏళ్ల వరకు ఉచిత విద్యుత్కు ఢోకా లేదు: ఎమ్మెల్సీ డొక్కా - ఏపీలో ఉచిత విద్యుత్కు నగదు బదిలీ వార్తలు
ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీతో ఎలాంటి నష్టం లేదని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. వచ్చే 35 ఏళ్ల వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు ఢోకా లేదని స్పష్టం చేశారు.
mlc dokka manikya varaprasad