గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో సహకార శాఖ డివిజన్ అథారిటీ సొసైటీ భూముల రద్దును వ్యతిరేకిస్తూ తీర్పు ఇవ్వగా ఆ భూములను ఎమ్మెల్యే విడదల రజని పరిశీలించారు. గత ప్రభుత్వం సొసైటీ భూములను రద్దు చేస్తే తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు పట్టాలు వచ్చే విధంగా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తనను విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ రైతులు పంటలు పండించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటామనన్నారు. త్వరలో రైతులతో కలిసి సీఎంను కలుస్తామని తెలిపారు.
'ఏమి మాట్లాడుతున్నారో ప్రత్తిపాటికే తెలియాలి' - society lands latest news
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియాలని గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని అన్నారు. చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూములను ఎమ్మెల్యే పర్యటించారు.
!['ఏమి మాట్లాడుతున్నారో ప్రత్తిపాటికే తెలియాలి' mla vidala rajini inspected society land in yadavalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6098334-1070-6098334-1581915674059.jpg)
సోసైటీ భూములను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే విడదల రజని