ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ప్రజలలో నాడు-ప్రజల కోసం నేడు" - "ప్రజలలో నాడు-ప్రజల కోసం నేడు" కార్యక్రమం

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాడికొండ నియోజకవర్గం, బండారుపల్లి గ్రామం నుంచి ప్రజాపాదయాత్ర ప్రారంభించనున్నారు. "ప్రజలలో నాడు-ప్రజల కోసం నేడు" అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అలాగే గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంఖుస్థాపన చేయనున్నారు.

MLA Undavalli Sridevi
"ప్రజలలో నాడు-ప్రజల కోసం నేడు"

By

Published : Nov 6, 2020, 10:41 AM IST

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం, బండారుపల్లి గ్రామం నుంచి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రజాపాదయాత్ర ప్రారంభించనున్నారు. సీఎం జగన్ పాదయాత్ర ప్రారంభించి ఈనెల 6వ తేదీకి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా "ప్రజలలో నాడు-ప్రజల కోసం నేడు" అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓ ఎస్సీ కాలనీ నుంచి పాదయాత్ర చేపట్టి... అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేశారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారని తెలిపారు. సీఎం జగన్​ పరిపానలో ప్రజల వద్దకే పథకాలు అందుతున్నాయని తెలిపారు. పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందున్నారు. ఈ పాదయాత్రలో పార్టీ శ్రేణులతో పాటు, ప్రభుత్వంలో భాగస్వామమైన ప్రజలందరూ పాల్గొనాలని శ్రీదేవి తెలిపారు.

ఇదీ చదవండీ...కేబినెట్ నిర్ణయాలు: రూ. వెయ్యి కోట్లతో భూముల సమగ్ర రీ సర్వే

ABOUT THE AUTHOR

...view details