ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అణగారిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే' - జ్యోతిరావు పూలేకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీదేవి

అణగారిన, వెనుకబడిన వర్గాలు, నిమ్నజాతుల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. పూలే వర్థంతి సందర్భంగా గుంటూరులోని నియోజకవర్గ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Mahatma Jyotiba Phule
అణగారిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే

By

Published : Nov 28, 2020, 11:17 PM IST

సమాజంలో స్త్రీ విద్యను ప్రోత్సహించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. పూలే వర్థంతి సందర్భంగా గుంటూరులోని నియోజకవర్గ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశంలో అణగారిన, సామాజిక వర్గాలు ఉన్నత స్థాయికి చేరారంటే ఆయన చేసిన పోరాట ఫలితమే అన్ని గుర్తుచేశారు.

మహాత్మా జ్యోతిరావు పూలే, బీఆర్. అంబేడ్కర్ వంటి మహనీయుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు పోరాడాలని ఎమ్మెల్యే కోరారు. అణగారిన, వెనుకబడిన వర్గాలు, నిమ్నజాతుల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని శ్రీదేవి కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details