గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ జీవోను రద్దు చేయాలని కోరుతూ.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. రాజధాని నిర్మాణాలకు మంగళగిరే సరైనదని పేర్కొన్నారు. నోటిఫికేషన్ కారణంగా రైతులు ఆయా భూముల వినియోగంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో తెలిపారు. అప్పట్లో రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు బలవంతంగా భూములు తీసుకున్నారని ఆరోపించారు.
భూసేకరణ జీవోను రద్దు చేయండి.. సీఎంకు ఆర్కే లేఖ - ముఖ్యమంత్రి జగన్కు ఆర్కే లేఖ
గత ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ జీవో వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారనీ.. దాన్ని రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్కు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే లేఖ రాశారు.
ముఖ్యమంత్రికి ఆర్కే లేఖ