రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తి అయిన సందర్బంగా ప్రజలలో నాడు.. ప్రజల కోసం నేడు పాదయాత్ర చేపట్టారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామం నుంచి వంకాయలపాడు, యడ్లపాడు గ్రామాల్లో కొనసాగిన పాదయాత్రలో ఎమ్మెల్యే రజిని పాల్గొన్నారు. జగన్... ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. నాడు పాదయాత్రలో ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు... సీఎం అయిన వెంటనే కులాలు, మతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని పేర్కొన్నారు.
'ప్రతి కుటుంబంలో ఆనందం నింపడమే సీఎం జగన్ లక్ష్యం' - mla rajini in padayatra at guntur district
మహిళా శ్రేయస్సు, ప్రతి కుటుంబంలో ఆనందం నింపడమే లక్ష్యంగా సీఎం జగన్ నిరంతరం పని చేస్తున్నారని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో ప్రజలలో నాడు.. ప్రజల కోసం నేడు పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు.
!['ప్రతి కుటుంబంలో ఆనందం నింపడమే సీఎం జగన్ లక్ష్యం' mla rajini in padayatra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9465210-788-9465210-1604743114395.jpg)
ప్రతి కుటుంబంలో ఆనందం నింపడమే సీఎం జగన్ లక్ష్యం