ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏడాది పాలన పూర్తైన సందర్భంగా పండ్లు పంపిణీ

By

Published : May 24, 2020, 4:04 PM IST

వైకాపా ప్రభుత్వ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే విడుదల రజిని రోగులకు పండ్లు, బ్రెడ్డులు పంపిణీ చేశారు.

mla rajani distributes fruits and bred to patients in govt hospital
ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ఎమ్మెల్యే సేవలు

వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే విడుదల రజిని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే తన వీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్డు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు 5 సంవత్సరాల సమయం పడుతుందన్నారు. కానీ, ఇప్పటికే వైకాపా 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చిందని అన్నారు. నవరత్నాలు పథకాలు వందకు వంద శాతం అమలు చేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details