'సాగర్ కుడికాల్వ ద్వారా రబీకి నీరందిస్తాం'
'సాగర్ కుడికాల్వ ద్వారా రబీకి నీరందిస్తాం' - latest news on guntur
గుంటూరు జిల్లాకు సాగర్ కుడికాల్వ ద్వారా ఆరుతడి పంటలకు సాగునీరందిస్తామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. గుంటూరు జడ్పీ సమావేశ మందిరంలో... అభివృద్ధి మండలి సమీక్షా సమావేశం నిర్వహించారు.

గుంటూరు అభివృద్ధిపై మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు
గుంటూరులో భూగర్భ మురుగుకాల్వ పనులతో దెబ్బతిన్న రహదారులకు... యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయనున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు వివరించారు. శ్రీరంగనాథరాజు అధ్యక్షతన గుంటూరు జడ్పీ సమావేశ మందిరంలో... అభివృద్ధి మండలి సమీక్షా సమావేశం జరిగింది. సాగర్ కుడికాల్వ ద్వారా రబీలో ఆరుతడి పంటలకు సాగునీరందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
TAGGED:
latest news on guntur