ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముంపు ప్రాంతాల్లో మంత్రి మోపిదేవి పర్యటన

గుంటూరు జిల్లాలో కృష్ణా నది వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి మోపిదేవి పర్యటించారు.

By

Published : Aug 16, 2019, 6:21 PM IST

వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మోపిదేవి

వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మోపిదేవి

గుంటూరు జిల్లాలో కృష్ణా నది దిగువ ప్రాంతాల్లో వరద ఉద్ధృతిని మంత్రి మోపిదేవి వెంకటరమణ పరిశీలించారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధిలతో కలిసి పర్యటించిన మంత్రి నదీ తీరంలో ఏర్పడిన గండ్లను వెంటనే పూడ్చాలని అథికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు నుంచి ప్రజలను కాపాడేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు భారీ మొత్తంలో ఇసుక బస్తాలను సిద్దం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు మోపిదేవి అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details