ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టెంపోను ఢీకొట్టిన ట్రాక్టర్... బీహార్ వలస కార్మికులకు గాయాలు

వలస కార్మికులతో వెళ్తున్న టెంపో వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టటంతో గంటూరు జిల్లా బోయపాలెం వద్ద ప్రమాదం జరిగింది. ఘటనలో 10 మంది వలస కూలీలు గాయపడ్డారు.

By

Published : May 17, 2020, 7:32 AM IST

Updated : May 17, 2020, 8:40 AM IST

tempo accident in boyapalem
వలస కార్మికుల టెంపో బోల్తా

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి బీహార్​కు వలస కూలీలతో వెళ్తున్న టెంపో వాహనాన్ని ట్రాక్టర్​ ఢీకొట్టటంతో టెంపో బోల్తా పడింది. దీంతో 10 మంది వలస కార్మికులు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాపడిన సంజయ్, నితీస్, మనోజ్ కుమార్, జాదన్, అదౌత్, సురేష్​లకు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా బీహార్​లో ధర్మాంగ్ జిల్లాకు వెళ్తున్నట్లు వివరించారు. తమ వాహనాన్ని చిప్స్ లోడ్​తో వస్తున్న ట్రాక్టర్ అతి వేగంగా ఢీకొట్టటంతోనే టెంపో బోల్తా పడినట్లు తెలిపారు.

టెంపోను ఢీకొట్టిన ట్రాక్టర్... బీహార్ వలస కార్మికులకు గాయాలు
Last Updated : May 17, 2020, 8:40 AM IST

ABOUT THE AUTHOR

...view details