ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

food Fridges: పేదల ఆకలి తీర్చేలా మేయర్ ఆలోచన.. ఆచరణలో పెడుతున్నారిలా..! - గుంటూరులో వేస్ట్ ఫుడ్

మనమంతా రోజు ఎంతో ఆహారాన్ని వృథా చేస్తుంటాం. మన ఇంట్లో రోజూ మనం పడేసే ఆహారం కనీసం ఒక్కరి కడుపైనా నింపుతుంది. అలా నగరంలో కొంతమంది ముందుకు వస్తే చాలు. వందలాది మంది నిరాశ్రయులకు కడుపునిండా భోజనాన్ని సమకూర్చగలరు. ఇలానే ఆలోచించారు ఆ మేయర్. తమ నగరంలో ఫుడ్ వేస్టేజ్ కాకుండా ఓ గొప్ప ఆలోచనకు పునాది వేశారు. నగరంలో ఫుడ్ ఫ్రిడ్జ్​లను నెలకొల్పుతున్నారు. ఇళ్లల్లో మిగిలిని పోయిన ఆహారాన్ని .. ఆ ఫ్రిడ్జ్​లలో స్టోర్ చేసి భోజనాన్ని అభాగ్యులకు అందించేలా చర్యలు చేపట్టారు.

mayor set up food fridges at guntur
గుంటూరు మేయర్ కావటి మనోహరనాయుడు

By

Published : Jun 24, 2021, 3:29 PM IST

పేదల ఆకలి తీర్చేందుకు గుంటూరు మేయర్ కావటి మనోహరనాయుడు ఓ చిరు ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. నగరంలో జరిగే శుభకార్యాలు, విందుల్లో మిగిలిన ఆహార పదార్థాలను ఆకలితో ఉన్నవారికి అందించేలా చర్యలు చేపట్టారు. దీనికోసం ఐదు ఫ్రిజ్​లను సిద్ధం చేశారు. ఆహార పదార్థాలను సేకరించి ఈ ఫ్రిజ్​లలో ఉంచనున్నారు. ఆకలితో వచ్చే వారికి ఈ ఆహారాన్ని అందించనున్నారు. దీని కోసం ఐదు ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు.

జనం ఎక్కువగా ఉండే గాంధీపార్కు, జీజీహెచ్, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జి సెంటర్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే ఉచిత ఆహారశాల వద్ద ఒక కార్పోరేషన్ ఉద్యోగిని ఉంచుతారు. వచ్చిన వారికి ఆహారం అందించే బాధ్యత వారికి అప్పగిస్తారు. చిన్నపాటి షెడ్లలో ఈ ప్రిజ్ లను ఉంచుతున్నారు. వీటికి అవసరమైన ఉపకరణాలను బిగించే పనులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఈ ఆలోచన కార్యరూపం దాల్చనుంది. దీని ద్వారా ఆకలితో ఉన్నవారి ఇబ్బంది తొలగించటంతో పాటు... ఆహారం వృథా కాదని మేయర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details