ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నో ఏళ్ల వేదనకు ఇప్పుడు విముక్తి: మంగాయమ్మ భర్త

73 ఏళ్ల వయసులో కృత్రిమ గర్భధారణ ప్రక్రియతో కవల పిల్లలకు జన్మనిచ్చింది మంగాయమ్మ. లేటు వయసులో తల్లి కావటం ద్వారా మంగాయమ్మ రికార్డు సృష్టించింది. ఇదంతా ఆధునిక వైద్య పరిజ్ఞానం గొప్పదనమని వైద్యులు చెబుతుంటే.... ఇది వైద్యుల ఘనతగానే మంగాయమ్మ దంపతులు కొనియాడుతున్నారు.

By

Published : Sep 5, 2019, 5:30 PM IST

మంగాయమ్మ దంపతులు

మంగాయమ్మ భర్త రాజారావుతో ముఖాముఖి

పిల్లలు లేరంటూ సూటిపోటి మాటలు.... రోడ్డుపైకి వెళ్తే అందరూ తప్పుకుని వెళ్లటం.... శుభ కార్యాలకు పిలుపులు లేకపోవటం ఇవన్నీ మంగాయమ్మ దంపతుల్ని ఎంతగానో బాధించాయి. ఎలాగైనా సంతానాన్ని పొందాలన్న ఆలోచన ఆమెలో పెరిగింది. 73 ఏళ్ల వయసులోనూ ధైర్యం చేసింది. కృత్రిమ గర్భధారణను ఎంచుకుంది. చివరికి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి... ఇన్నాళ్లూ పడిన ఆవేదనను దూరం చేసుకుంది. మంగాయమ్మ ఆరోగ్యం, ప్రసవం విషయంలో వైద్యులు చూపిన ఆప్యాయత.... శ్రద్ధ... ఎప్పటికీ మరువలేనని ఆమె భర్త రాజారావు చెప్పారు. పుట్టిన ఇద్దరూ అమ్మాయిలే అయినా తనకు ఎలాంటి బాధ లేదని... వారిలో ఒకరిని దేశ సేవకు... మరొకరిని ఆధ్యాత్మిక సేవకు పంపిస్తానని అన్నారు. ఈ దిశగా ఆయన ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తున్నారు. పిల్లలు కలగాలని ఎంతో మంది వైద్యులను సంప్రదించినా ఫలితం రాలేదని.. గుంటూరుకు చెందిన వైద్యులు ఉమాశంకర్.. ఆధునిక వైద్యం సాయంతో తమ వేదన తీర్చారని చెప్పారు.

సంబంధిత కథనాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details