ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'10 టన్నుల ఇసుకలో 2 టన్నులకు పైగా రాళ్లు' - government sand booking system ap news

ఓ వ్యక్తి 10 టన్నుల ఇసుకను ఆన్​లైన్​లో బుక్ చేశాడు. రూ.8 వేలు చెల్లించాడు. లోడు వచ్చాక ఇసుకలో రాళ్లను గమనించాడు. రాళ్లు ఏరివేస్తున్నాకొద్దీ... ఇంకా వస్తూనే ఉన్నాయి. అన్నీ లెక్కేస్తే.. సుమారు 2 టన్నుల రాళ్లయ్యాయి.

guntur district news
10 టన్నుల ఇసుకలో 2 టన్నులకు పైగా రాళ్లు

By

Published : Jul 18, 2020, 5:19 PM IST

10 టన్నుల ఇసుకలో 2 టన్నులకు పైగా రాళ్లు

ఇంటి నిర్మాణానికి 10 టన్నుల ఇసుక బుక్ చేస్తే... అందులో 2 టన్నులకు పైగా రాళ్లే వచ్చాయని ఓ వ్యక్తి ఆవేదన చెందాడు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చాగల్లుకు చెందిన జొన్నలగడ్డ సురేష్ తన ఇంటి నిర్మాణం కోసం ఆన్‌లైన్‌లో 10 టన్నుల ఇసుకను 8 వేలు చెల్లించి బుక్ చేశాడు.

తీరా ఇసుక లోడు వచ్చాక చూస్తే అందులో సుమారు 2 టన్నుల వరకు రాళ్లతో కూడిన ఇసుక వచ్చింది. లారీ డ్రైవర్‌ను ఇసుక బాగోలేదని అడగ్గా తనకు సంబంధం లేదని తెలిపాడు. ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి తనకు తగిన న్యాయం చేయాలని బాధితుడు సురేష్ కోరుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details