మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండకు ప్రభలు కట్టి తరలించే క్రమంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అపశృతి చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని పురుషోత్తమ పట్నంలో ప్రభ వద్ద విద్యుత్ ఘాతానికి గురై ఓ కార్మికుడు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని తోట పుల్లప్పగారి ప్రభ పండుగను శనివారం రాత్రి నిర్వహించారు. అనంతరం ప్రభకు విద్యుత్ దీపాలు ఏర్పాటుచేసిన సిబ్బంది తిరిగి వాటిని ఇవాళ తీసేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో.. ప్రభకు హై టెన్షన్ తీగలు తగిలి విద్యుత్ సరఫరా అయింది.