ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థల వివాదం.. అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి - నగరంలో స్థల వివాద మరణాలు

గుంటూరు జిల్లా నగరం మండలంలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. స్థల వివాదంలో ప్రత్యర్థులతో ఘర్షణ అనంతరం.. ఈ ఘటన జరగడంపై.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

man died in suspiciuos condition at nagaram mandal
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

By

Published : Sep 21, 2020, 10:01 AM IST

గుంటూరు జిల్లా నగరం మండలంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తాడివాకవారిపాలెం గ్రామానికి చెందిన టి.గుడారావు (72) కు ,అదే గ్రామానికి చెందిన పి.సత్యనారాయణ (45) అనే వ్యక్తికి 18 వ తేదీ సాయంత్రం ఇంటి స్థలానికి సంబంధించి వివాదం జరిగింది. ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో గ్రామ పెద్దలు వచ్చి వివాదాన్ని పరిష్కరించారు.

ఈ క్రమంలోనే... 19వ తేదీన గుడారావు తన స్వగృహంలో చనిపోయాడు. మెడపై గాయాలు గమనించిన కుటుంబసభ్యులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details