గుంటూరు జిల్లా బాపట్లలోని ఉప్పరపాలెం రోడ్డులో స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మూలపాలేనికి చెందిన బడుగు అంకయ్య.. ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడిపినందునే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని.. స్థానికులు, మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.
స్కూల్ బస్సు ఢీ.. వ్యక్తి మృతి - రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
స్కూల్ బస్సు ఢీకొని.. గుంటూరు జిల్లా బాపట్లలోని మూలపాలెనికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన.. ఉప్పరపాలెం రోడ్డులో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు ఆందోళనకు దిగారు.

స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి