ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 6, 2020, 7:20 PM IST

Updated : Nov 7, 2020, 10:14 AM IST

ETV Bharat / state

భార్య కాపురానికి రాలేదని విద్యుత్​ టవర్ ఎక్కిన భర్త

గుంటూరు జిల్లా దొండపాడుకు చెందిన గోపి అనే యువకుడు.. విద్యుత్ టవర్ ఎక్కాడు. ఆరు నెలల క్రితం ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న గోపి... నిత్యం అనుమానంతో భార్యను వేధిస్తున్నాడన్న ఆరోపణతో.. పుట్టింటికి వెళ్లింది. భార్యను తనతో పంపించాలంటూ గోపి విద్యుత్ టవర్ ఎక్కాడు.

కుటుంబ కలహాలతో సెల్ టవర్ ఎక్కిన యువకుడు
కుటుంబ కలహాలతో సెల్ టవర్ ఎక్కిన యువకుడు

కుటుంబ కలహాలతో గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలో ఓ యువకుడు విద్యుత్ టవర్ ఎక్కాడు. దొండపాడుకు చెందిన గోపి అనే వ్యక్తి ఓ మహిళను ఆరు నెలల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.

అతడు తనను నిత్యం వేధిస్తున్నాడంటూ... 3 రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. ఆమెను తనతో పంపించాలంటూ విద్యుత్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు గోపిని కిందకు దించేందుకు యత్నించారు. చివరకు అతని భార్య వచ్చి తాను కాపురానికి వస్తానని చెప్పిన మేరకు.. గోపి కిందకు దిగాడు.

Last Updated : Nov 7, 2020, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details