ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జొన్న చేలో శవం.. సంచిలో చెయ్యి.. ఏంటా మిస్టరీ.. !? - గుంటూరు జిల్లా తాజా వార్తలు

ఓ వ్యక్తి జొన్నచేలో జీవం లేకుండా పడి ఉన్నాడు అని సమాచారం వచ్చింది గుంటూరు జిల్లా పోలీసులకు.. ! వెళ్లి చూస్తే.. అతని ప్రాణమే కాదు.. ఓ చెయ్యి కూడా పోయింది. మరి కొంత సేపటికి మరో చోట... మరో వ్యక్తి దగ్గర సంచిలో చెయ్యి దొరికింది. ఇంతకీ వారిద్దరి మధ్యా...ఏం జరిగింది.? చంపి చెయ్యి నరికి తీసుకెళ్లాల్సినంత కక్షకు కారణమేంటి....? ఈ మిస్టరీ వెనకున్న మర్మాన్ని ఛేదించే పనిలో ఉన్నారు గుంటూరు జిల్లా పోలీసులు..!

మృతదేహన్ని పరిశీలిస్తున్న పోలీసులు
మృతదేహన్ని పరిశీలిస్తున్న పోలీసులు

By

Published : Mar 31, 2021, 4:15 PM IST

Updated : Mar 31, 2021, 5:23 PM IST

మృతదేహన్ని పరిశీలిస్తున్న పోలీసులు

గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులకు ఓ సమాచారం వచ్చింది... రామచంద్రపాలెం వెళ్లే రోడ్డులోని ఓమొక్కజొన్న చేలో మృతదేహం ఉందన్నది దాని సారాంశం. జాగిలాలతో పాటు అక్కడకు వెళ్లిన పోలీసులు చుట్టుపక్కల పరిసరాలు పరిశీలించారు. చనిపోయిందెవరో తెలుసుకునే ప్రయత్నంలో మృతదేహాన్ని పరిశీలించి.. ఖంగుతిన్నారు. నిశితంగా పరిశీలిస్తే..ఆ మృతదేహానికి ఓ చెయ్యి లేదు ఎవరో నరికినట్లు ఆనవాళ్లున్నాయి. ఆ చెయ్యి ఎక్కడుందో వెతికేందుకు జాగిలాలను వదిలారు. జొన్నచేను జల్లెడపట్టారు..

మృతదేహం ఎవరిది? ఎవరు చంపి ఉంటారు..? అతను చెయ్యి ఎందుకు నరికారు..?అసలు ఆ చెయ్యి ఎక్కడుందన్నవి పోలీసుల ముందున్న ప్రశ్నలు. వీటిని చేధించే క్రమంలోనే వారికి నల్లపాడు పోలీసుల నుంచి ఓ సమాచారం వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ లారీని తనిఖీ చేయగా అందులో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తి వద్ద సంచి గుర్తించామని, దాన్ని పరిశీలిస్తే అందులో చేయి ఉందన్నది దాని సారాంశం. లారీ డ్రైవర్‌, క్లీనర్‌తోపాటు సదరు వ్యక్తినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హత్యకు కారణాలు ఏంటి..?

ఓ వ్యక్తిని హత్య చేయడమే కాకుండా.. దారుణంగా చేతిని నరికి తీసుకెళ్లడం పోలీసులను సైతం గగుర్పాటుకు గురి చేసింది. అక్రమ సంబంధం కానీ, ఆస్తి తగాదాలు కానీ హత్యకు కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది: ఎస్​ఈసీ నిమ్మగడ్డ

Last Updated : Mar 31, 2021, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details