ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వంశీకో న్యాయం... నాకో న్యాయమా..?'

ఇటీవల ముఖ్యమంత్రి జగన్​ను కలిసిన ఎమ్మెల్యే మద్దాల గిరికి తెదేపా షాక్ ​ఇచ్చింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి కొత్త ఇన్​ఛార్జిని నియమించింది. దీనిపై మద్దాలి గిరి స్పందించారు. తెదేపా అధినేత చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.

By

Published : Jan 2, 2020, 6:51 PM IST

madali giridhar wrote open letter to chadrababu
చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన మద్దాలి గిరిధర్

మీడియాతో మాట్లాడుతున్న మద్దాలి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్... తెదేపా అధినేత చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే 12గంటల వ్యవధిలోనే ఇన్​ఛార్జిని నియమిస్తారా... అని ప్రశ్నించారు. గన్నవరంలో వల్లభనేని వంశీ పార్టీకి దూరంగా ఉండి 3నెలలు అవుతుంది. ఇప్పటివరకూ అక్కడ ఇన్​ఛార్జినిను నియమించలేదని గుర్తుచేశారు. వంశీకో న్యాయం... నాకో న్యాయమా..?అని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక వర్గాలపై తెదేపా చిన్నచూపు చూస్తోందని మద్దాలి గిరి ఆరోపించారు. చంద్రబాబు సమాధానం చెప్పాలని మాద్దాలి గిరి డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details