Macherla Passenger Train Stopped: గమ్యం చేరకుండానే రైలు నిలిపివేత.. ప్రయాణికుల అవస్థలు
22:09 December 09
Macherla Passenger Train Stopped At Nadikudi: నడికుడిలో ఆపేసిన అధికారులు
Macherla Passenger Train Stopped: మాచర్ల ప్యాసింజర్ రైలును నడికుడి వద్ద అర్థంతరంగా అధికారులు నిలిపివేశారు. గుంటూరు జిల్లా మాచర్ల వరకు వెళ్లాల్సిన ప్యాసింజర్ రైలును అకస్మాత్తుగా నిలిపివేయడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రైలును నిలిపివేయడంతోపాటు ఎలాంటి రవాణా సౌకర్యం వారికి కల్పించకపోవడంతో.. రైల్వే సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రివేళ ఎక్కడకు వెళ్లాలని? ఎలా వెళ్లాలని ప్రశ్నించారు.
ఇదీ చదవండి..Accident: ఆటోను ఢీకొన్న లారీ.. వాగులో ఐదుగురు గల్లంతు