ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మానవత్వం చాటుకున్న మాచర్ల పోలీసులు - మహిళకు మాచర్ల పోలీసులు సాయం

లాక్​డౌన్ నేపథ్యంలో వాహనాలు దొరక్క ఇబ్బందులు పడుతున్న ఓ బాలింతకు మాచర్ల రూరల్ ఎస్సై సాయం చేశారు. పోలీస్ వాహనంలో ఆమెను ఇంటివద్ద వదిలిపెట్టారు.

macharla police
macharla police

By

Published : Apr 20, 2020, 1:25 PM IST

గుంటూరు జిల్లా మాచర్లలో ఆటో కోసం వేచి ఉన్న తల్లీబిడ్డను పోలీసులు తమ వాహనంలో ఇంటి వద్ద విడిచిపెట్టి మానవత్వం చాటుకున్నారు. మాచర్లలో నివాసం ఉండే ఓ మహిళ కొద్దిరోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. ఇవాళ ఉదయం వైద్య పరీక్షల కోసం తల్లితో కలిసి ఆసుపత్రికి వెళ్లారు. ఉదయం ఆటోలో వచ్చిన వారు.... తిరిగి వెళ్లేటప్పుడు వాహనం దొరక్క ఇబ్బంది పడ్డారు. మాచర్లలోని నెహ్రూనగర్ చెక్​పోస్ట్ వద్దకు వచ్చి ఆటో కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. అప్పుడే రౌండ్స్​కి వచ్చిన మాచర్ల రూరల్ ఎస్సై ఉదయలక్ష్మి... వారిని చూసి చలించిపోయారు. వెంటనే తన వాహనంలో వారిని ఇంటివద్ద వదిలిపెట్టమని కానిస్టేబుల్​కు చెప్పారు. బాలింతను, ఆమె తల్లిని, బిడ్డను కానిస్టేబుల్ వారి ఇంటికి చేర్చారు.

ABOUT THE AUTHOR

...view details