ముఖ్యమంత్రి జగన్కు వాలంటీర్లపై ఉన్న ప్రేమ.. రాష్ట్ర ప్రజలపై లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదని, ఒక్క ఏపీలోనే ఈ దుస్థితి నెలకొందని విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి తెదేపా కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. అసలు పనులు దొరకడం లేదని కార్యకర్తలు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. సీఎం వాలంటీర్లకు జీతాలు పెంచి, పింఛన్లు తగ్గించారని విమర్శించారు.
'సీఎం జగన్కు వాలంటీర్లపై ఉన్న ప్రేమ.. ప్రజలపై లేదు'
దేశంలో ఏ రాష్ట్రంలోనూ.. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు లేవన్న తెదేపా నేత లోకేశ్.. వైకాపా అస్తవ్యస్త విధానాల వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో పర్యటించిన ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు.
"సీఎం జగన్కు వాలంటీర్ల ఉన్న ప్రేమ... ప్రజలపై లేదు"