గుంటూరు జిల్లా మంగళగిరిలో రేపటి నుంచి లాక్డౌన్కు సడలింపులు ఇవ్వనున్నారు. మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసులు సున్నాకు రావటంతో లాక్డౌన్లో సడలింపులివ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నియోజకవర్గ అధికారులతో శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సడలింపులో కచ్చితంగా నిబంధనలు పాటించాలని అధికారులకు సూచించారు. మరో కేసు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వస్త్ర, ఆభరణాలు, పాదరక్షల దుకాణాలు మినహా అన్నింటికి అధికారులు అనుమతులిచ్చారు.
రేపటి నుంచి మంగళగిరిలో లాక్ డౌన్ సడలింపులు - corona cases in mangalagiri
గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా కేసులు సున్నాకు రావటంతో రేపటినుంచి లాక్డౌన్లో సడలింపులు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. వస్త్ర, ఆభరణాలు, పాదరక్షలు మినహాయించి అన్నీ దుకాణాలు తెరవవచ్చని తెలిపారు.
![రేపటి నుంచి మంగళగిరిలో లాక్ డౌన్ సడలింపులు lockdown ezcemption in guntur dst mangalgiri from tommarrow onwards](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7305431-497-7305431-1590147360317.jpg)
lockdown ezcemption in guntur dst mangalgiri from tommarrow onwards