ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్: ఉల్లంఘనలపై పోలీసుల కొరడా - లాక్​డౌన్ ఉల్లంఘనులపై కొరడా

లాక్​డౌన్​ను ఉల్లంఘించే వారిపై పోలీసులు కొరడా ఘుళిపిస్తున్నారు. అవసరం లేకపోయినా రోడ్లపైకి వస్తూ ఆంక్షలను బేఖాతరు చేసేవారి వాహనాల్ని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు.

Lock down on lockdown violations
లాక్​డౌన్ ఉల్లంఘనులపై కొరడా

By

Published : Apr 13, 2020, 5:36 AM IST

లాక్​డౌన్​ను ఉల్లంఘించే వారిపై పోలీసులు కొరడా ఘుళిపిస్తున్నారు. అవసరం లేకపోయినా రోడ్లపైకి వస్తూ ఆంక్షలను బేఖాతరు చేసేవారి వాహనాల్ని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. మార్చి 24 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు మొత్తం 9,498 కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 1,417... నెల్లూరులో 1,144 కేసులు నమోదు చేయగా... అత్యల్పంగా విజయవాడలో 102, తూర్పుగోదావరి జిల్లాలో 117 కేసులు నమోదయ్యాయి. మోటారు వాహనాల చట్టం ప్రకారం భారీగా జరిమానాలు విధించారు. సీజ్ చేసిన వాహనాలను లాక్​డౌన్ ముగిసేవరకు ఇవ్వరు. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 2,057, విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 132 వాహనాలు సీజ్ చేశారు.

కేసుల వివరాలు ఇలా...

ఐపీసీ సెక్షన్లు 188, 269, 279, 217, కింద నమోదు చేసిన కేసులు 9,498

పదేపదే వాహనాలతో రోడ్లపైకి వచ్చేవారిని గుర్తించి సీజ్ చేసిన వాహనాలు 13,956

మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 179 ప్రకారం నమోదు చేసిన కేసులు 2,41,481

నిబంధనలు ఉల్లంఘించినందుకు చలానాల ద్వారా వసూలు చేసిన మొత్తం రూ.11.21కోట్లు

ఇదీ చదవండి:

'గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల నిధులపై ఫ్రీజింగ్​ ఎత్తివేయండి'

ABOUT THE AUTHOR

...view details