ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరులో రూ.3.5లక్షలు విలువ చేసే మద్యం పట్టివేత

By

Published : Feb 15, 2021, 10:58 PM IST

గుంటూరు జిల్లాలో పోలీసులు భారీ ఎత్తున తెలంగాణ నుంచి తీసుకువస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. మోరంజపాడు గ్రామంలో 11 బస్తాల్లో రూ.3.5 లక్షలు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

liquor seized in guntur district
గుంటూరులో రూ.3.5లక్షలు విలువ చేసే మద్యం పట్టివేత

గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని మోరంజపాడు గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. 11 బస్తాల్లో రూ.3.5 లక్షలు విలువ చేసే సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎక్సైజ్ ఎన్​పోర్స్​మెంట్​కు వచ్చిన సమాచారంతో నరసరావుపేట సబ్ సూపరింటెండెంట్ వేంపల్లి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో పిడుగురాళ్ల, మాచర్ల ఎక్సైజ్ సీఐలు దాడులు నిర్వహించారు. గ్రామంలో చల్లా నాగారాజు ఇంట్లో నిల్వ ఉంచిన 11 బస్తాలను స్వాధీనం చేసుకుని... పిడుగురాళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి

ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అదృశ్యం.. రూ.కోటికి పైగా అప్పు!

ABOUT THE AUTHOR

...view details