ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పర్యావరణానికి హాని కలగకుండా దీపావళిని జరుపుకుందాం' - ధ్వని కాలుష్యంతో ఏర్పడుతుంది

టపాసులు పేల్చడం వల్ల కరోనా బారిన పడిన వారికి ఆరోగ్యం మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు గుంటూరు నగర కమిషనర్. పర్యావరణానికి హాని కలగకుండా దీపావళిని జరుపుకోవాలని కోరారు. స్వీట్స్​ పంచుకుని సంతోషాన్ని పంచుకోవాలన్నారు.

Let's celebrate Diwali without harming the environment' at guntur
'పర్యావరణానికి హాని కలగకుండా దీపావళిని జరుపుకుందాం'

By

Published : Nov 13, 2020, 9:02 PM IST

పర్యావరణానికి హాని కలగకుండా దీపావళిని జరుపుకోవాలని గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ కోరారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో "గ్రీన్ దీపావళి" పోస్టర్​ని ఆవిష్కరించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగించాలని తెలిపారు. స్వీట్స్​ పంచుకుని సంతోషాన్ని పంచుకోవాలన్నారు.

ప్రమాదకర రసాయనాలతో తయారు చేసిన టపాసులు పేల్చడం వల్ల పర్యావరణ, ధ్వని కాలుష్యంతో ఏర్పడుతుందని వివరించారు. కరోనా బారిన పడిన వారికి ఆరోగ్యం మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. టపాసులు కాల్చే సమయంలో శానిటైజర్​ని ఉపయోగించకూడాదని, అవసరం అయితే సబ్బు నీళ్ళు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details