ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కిడ్నాప్​ చేసి భూమి రాయించుకున్న ముఠా అరెస్టు​ - కిడ్నాప్ కేసును ఛేదించిన గుంటూరు పోలీసులు

ధరణికోటలో ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్​ చేసి వారి భూమి రాయించుకున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయారావు కేసు వివరాలు వెల్లడించారు.

కిడ్నాప్​ చేసి భూమిని రాయించుకున్న ముఠా అరెస్ట్​
కిడ్నాప్​ చేసి భూమిని రాయించుకున్న ముఠా అరెస్ట్​

By

Published : Dec 1, 2019, 7:07 PM IST

కిడ్నాప్​ చేసి భూమి రాయించుకున్న ముఠా అరెస్టు​

గుంటూరు జిల్లా ధరణికోటలో ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్​తో రూ.15 కోట్ల విలువైన భూమిని తమ పేరున రాయించుకున్న ముఠా సభ్యుల ఆటకట్టించారు. ఈ కేసులో బాచీ అనే కానిస్టేబుల్ సహా 12 మంది నిందితులను గుర్తించగా... వీరిలో 9 మందిని అరెస్టు చేశారు. ధరణికోటకు చెందిన రమేశ్ బాబు, అతని మేనమామ హనుమంతరావును కిడ్నాప్ చేశారు. రమేశ్​ కుటుంబసభ్యుల్ని బెదిరించారు. తర్వాత ఇద్దరినీ రిజస్ట్రేషన్ ఆఫీస్​కు తీసుకెళ్లి బలవంతంగా వారి భూమిని రాయించుకున్నారని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయారావు వివరించారు. బాధితుడు రమేశ్... ఎస్పీకి ఫిర్యాదు చేశాకా... కిడ్నాప్, దౌర్జన్యం ఘటన వెలుగులోకి వచ్చింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details