ప్రజల అప్రమత్తతతోనే కొవిడ్ అదుపులోకి వస్తుందని.. కేరళ పర్యాటక శాఖ ఎండీ మైలవరపు కృష్ణతేజ అభిప్రాయపడ్డారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా చిలకలూరిపేట. కొవిడ్ సమయంలో.. కేరళలో పౌరసరఫరాల ప్రత్యేక అధికారిగా కృష్ణతేజ విధులు నిర్వర్తించారు. ఎంతోమంది చిలకలూరిపేట కొవిడ్ బాధితులకూ అండగా నిలిచారు. సుమారు 500 మందికి తన సేవలు అందించారు. కరోనా సమయంలో కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి.. స్వస్థలానికి వచ్చిన కృష్ణతేజ వివరించారు.
కరోనా కట్టడికి అప్రమత్తతే ఆయుధం: కేరళ పర్యాటక శాఖ ఎండీ - కొవిడ్ కట్టడికి కేరళ తీసుకున్న చర్యలు
కొవిడ్ కట్టడికి అప్రమత్తతే ఆయుధమని కేరళ పర్యాటక శాఖ ఎండీ, చిలకలూరిపేటకు చెందిన మైలవరపు కృష్ణతేజ పేర్కొన్నారు. కరోనా సమయంలో స్వస్థల వాసులకూ ఆయన ఎన్నో సేవలందించారు. వైరస్పై పోరాటానికి కేరళ తీసుకున్న చర్యలను వివరించారు.
కొవిడ్ కట్టడిపై మాట్లాడుతున్న కేరళ పర్యాటక శాఖ ఎండీ కృష్ణతేజ