ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్తిక పౌర్ణమి ప్రత్యేకం.. శివయ్యను స్మరిస్తూ కోలాటం

చిలకలూరిపేట మండలం పోలిరెడ్డిపాలెం గ్రామంలోని విఘ్నేశ్వరాలయంలో కార్తిక మాసం పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాగంణంలో దీపాలతో శివలింగాకారాన్ని ఏర్పాటు చేశారు. శివయ్యను స్మరిస్తూ గ్రామ మహిళలు చేసిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది.

By

Published : Nov 29, 2020, 10:45 PM IST

పోలిరెడ్డిపాలెం గ్రామంలో కార్తిక మాసం పూజలు
పోలిరెడ్డిపాలెం గ్రామంలో కార్తిక మాసం పూజలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పోలిరెడ్డిపాలెం గ్రామంలోని సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరాలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాగంణంలో దీపాలతో శివలింగాకారాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించిన కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

పోలిరెడ్డిపాలెం గ్రామంలో కార్తిక మాసం పూజలు

కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏటా గ్రామంలోని విఘ్నేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. నూతన దేవాలయం నిర్మాణం అనంతరం కార్తిక పౌర్ణమి రోజు గ్రామ మహిళలు కోలాటం ఆడతూ శివయ్యను పూజించడం ఆనవాయితిగా మారింది.

ABOUT THE AUTHOR

...view details