కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కాపీ కొట్టి తన పథకాలుగా చెప్పుకుంటున్నారని భాజపారాష్ట్ర అధ్యక్షుడు కన్నా విమర్శించారు.
By
Published : Mar 29, 2019, 5:13 AM IST
కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం
కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం
కేంద్ర ప్రభుత్వ పథకాలను చంద్రబాబు నాయుడు తన పథకాలుగా చెప్పుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే కమలం గుర్తుకు ఓటేయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభ్యర్థి నలబోతు వెంకట్రావును అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.