ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కుంకలగుంటలో జనసేన నేతల ఆందోళన

By

Published : Apr 8, 2021, 5:41 PM IST

గుంటూరు జిల్లా కుంకలగుంటలో జనసేన నేతలు ఆందోళన చేశారు. ఎన్నికల్లో వైకాపా నేతలు రిగ్గింగ్​కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ... ప్రధాన రహదారిపై బైఠాయించారు.

janasena leaders protest at kunkalagunta guntur district
కుంకలగుంటలో జనసేన నేతల ఆందోళన

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని 41వ పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా నాయకులు రిగ్గింగ్ కు పాల్పడ్డారని జనసేన నేతలు ఆరోపించారు.

ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్న తమను వైకాపా, తెదేపా శ్రేణులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తమకు న్యాయం చేయాలంటూ.. గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న నకరికల్లు పోలీసులు పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

ABOUT THE AUTHOR

...view details