ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 27, 2020, 2:14 PM IST

ETV Bharat / state

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన నిరసన

దేవాలయ భూములు అమ్మకానికి నిరసనగా గుంటూరులోని అమరావతి రోడ్డులోని పార్టీ కార్యాలయంలో జనసేన ఆధ్వర్యంలో 24 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. పదో రోజు దీక్షలో గుంటూరు మార్కెట్​ అమ్మకాన్ని తక్షణమే నిలిపివేయాలని, విద్యుత్​ బిల్లులు తగ్గించాలని డిమాండ్​ చేశారు.

janasena 24 hours inmates
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనసేన దీక్షలు

ప్రభుత్వ దేవాలయ భూములు అమ్మకానికి నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. గుంటూరు అమరావతి రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో గత 10 రోజులుగా రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తున్నారు. నగరంలోని పీవీకే నాయుడు మార్కెట్ అమ్మకాన్ని తక్షణమే నిలిపివేయాలని, లాక్​డౌన్​ సమయంలో వచ్చిన విద్యుత్ బిల్లులును పూర్తిగా మాఫీ చేయాలని జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్, లీగల్ కన్వీనర్ గాదె వెంకటేశ్వరరావు, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details