ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబటిని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు, ఆందోళన

గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామంలో జనసేన కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. తెదేపా, వైకాపా నాయకులు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. అంబటి రాంబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

By

Published : Apr 11, 2019, 1:41 PM IST

దమ్మాలపాడులో అంబటిని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు

దమ్మాలపాడులో అంబటిని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు

గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామంలో జనసేన కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. తెదేపా, వైకాపా నాయకులు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. 247, 248 బూతులలో ఎన్నికలు జరుగుతున్నందున సభాపతి కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం, వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబులు వేరువేరుగా గ్రామానికి వచ్చారు. ముందు శివరాం కారును అడ్డుకున్న జనసేన కార్యకర్తలు... తర్వాత అంబటి రాంబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఒక దశలో పోలీసులను లెక్కచేయకుండా వాగ్వాదానికి దిగారు. పోలీసులను నెట్టుకుంటూ రోడ్డుపై బైఠాయించారు. రాంబాబుని ఇక్కడి నుంచి పంపితే గాని ఆందోళన విరమించమని డిమాండ్ చేశారు. దానితో పోలీసులు వెంటనే అంబటి రాంబాబును అక్కడి నుంచి పంపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details