ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాన్న కంటే మంచి పాలన అందిస్తా: సీఎం జగన్ - undefined

తన తండ్రి వైఎస్​ కంటే మెురుగ్గా పరిపాలన అందిస్తానని ముఖ్యమంత్రి జగన్​ అన్నారు. రాష్ట్రాభివృద్ధికోసం ముస్లిం మతపెద్దలు ప్రార్థనలు చేయాలని కోరారు. రంజాన్​ మాసంలో వచ్చిన ఫలితాల్లోనే వైకాపా గెలిచిందని అన్నారు.

jagan

By

Published : Jun 3, 2019, 7:29 PM IST

Updated : Jun 3, 2019, 7:57 PM IST

ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రార్థనలు

వైకాపా నుంచి ఐదుగురు ముస్లిం సొదరులకు టికెట్ ఇస్తే నలుగురు గెలిచారని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఓడిపోయిన ఇక్బాల్​కు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. గుంటూరులో పోలీసు మైదానంలో ప్రభుత్వం తరఫున జరిగిన ఇఫ్తార్​ విందుకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఆయనతోపాటు వైకాపా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో జగన్​ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. దేవుడు రాసే రాత చాలా విచిత్రంగా ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకున్న తెదేపాకు.. ఈ నెల 23న వచ్చిన ఫలితాల్లో 23 సీట్లే వచ్చాయని అన్నారు.

Last Updated : Jun 3, 2019, 7:57 PM IST

For All Latest Updates

TAGGED:

jagan iftar

ABOUT THE AUTHOR

...view details