ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో ఇస్కాన్ ప్రతినిధి బృందం విరాళాల సేకరణ

పశ్చిమ బంగా, మాయాపూర్​లో నిర్మిస్తోన్న ఆధ్యాత్మిక నగర నిర్మాణానికి విరాళాల సేకరణకు ఇస్కాన్ ప్రతినిధులు దేశంలోని ఇతర ఇస్కాన్ మందిరాలకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గుంటూరు వచ్చిన ఇస్కాన్ ప్రతినిధులు మల్లారెడ్డినగర్​లోని  కృష్ణ  మందిరాన్ని సందర్శించారు.

By

Published : Jul 17, 2019, 2:32 AM IST

800 కోట్లతో ఆధ్యాత్మిక నగర నిర్మాణం

800 కోట్లతో ఆధ్యాత్మిక నగర నిర్మాణం

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో పశ్చిమ బంగాలోని మాయాపూర్​లో.. రూ. 800 కోట్ల వ్యయంతో ఆధ్యాత్మిక నగరాన్ని నిర్మిస్తున్నారు. ఈ మేరకు విరాళాల సేకరణ నిమిత్తం.. ఇస్కాన్ ప్రతినిధులు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. గుంటూరుకు వచ్చిన ఇస్కాన్ ప్రతినిధి బృందం.. మల్లారెడ్డినగర్​లోని కృష్ణ మందిరాన్ని సందర్శించారు. మాయాపూర్ ఇస్కాన్ ప్రధాన అర్చకులు జన నివాస్ ప్రభు, బ్రిజ బిహారి, రేవతి రమణ ప్రభు, కొండవీడు స్వర్ణహంస ప్రాజెక్టు డైరెక్టర్ రామ్ మురారి దాస్​లకు కృష్ణ చైతన్య సంఘ సభ్యులు, భక్తులు సాదర స్వాగతం పలికారు.

ABOUT THE AUTHOR

...view details