ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మేమూ ఈ-చలానాల బాధితులమే.. మండలిలో బీఆర్​ఎస్ ఎమ్మెల్సీలు

Interesting Discussion on E Challans In TS Legislative Council: శాసనమండలి సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం బీఆర్​ఎస్ సభ్యుడు శేరి సుభాష్‌రెడ్డి ట్రాఫిక్‌ ఈ-చలానాల అంశాన్ని ప్రస్తావించారు. దానికి ప్రతిస్పందనగా అధికారపక్షానికి చెందిన పలువురు సభ్యులు తాము ఈ-చలానాల బాధితులమేనని సమాధానం ఇచ్చారు.

By

Published : Feb 9, 2023, 11:30 AM IST

Published : Feb 9, 2023, 11:30 AM IST

e-challans
ఈ-చలానాల

Interesting Discussion on E Challans In TS Legislative Council:తెలంగాణ శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం బీఆర్​ఎస్ సభ్యుడు శేరి సుభాష్‌రెడ్డి ట్రాఫిక్‌ ఈ-చలానాల అంశాన్ని ప్రస్తావించారు. హైవేల్లో 60 కి.మీ.ల వేగంతో వెళితేనే అధిక వేగం కింద ఈ-చలానా నమోదవుతోందని పేర్కొన్నారు. తన వాహనంపై ఇలాంటి చలానాలు అనేకం నమోదయ్యాయని వాటి ప్రతుల్ని ప్రదర్శించారు. వేగపరిమితిని 85-90 కి.మీ.లకైనా పెంచాలని కోరారు. ఈ క్రమంలో అధికారపక్షానికి చెందిన పలువురు ఇతర సభ్యులు.. తామూ ఈ-చలానాల బాధితులమేనని సుభాష్‌రెడ్డి వాదనకు శ్రుతి కలిపారు.

BRS MLCs on E challans : ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ.. అధికవేగం, మద్యం తాగి వాహనం నడపడం, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌, ఓవర్‌లోడింగ్‌ కారణాలతో రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నందునే కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నియమాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సిగ్నలింగ్‌ వ్యవస్థను యూరోపియన్‌ దేశాల తరహాలో ఐటీఎంఎస్‌ ప్రాజెక్టు కిందకు మార్చుతున్నట్లు తెలిపారు. దీనివల్ల హైదరాబాద్‌ రోడ్లపై వాహనాల సగటు వేగం గంటకు 22 కి.మీ.ల నుంచి 27 కి.మీ.లకు పెరిగిందన్నారు.

ఇతర రాష్ట్రాల నేరస్థులే ఎక్కువగా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నారు : తెలంగాణ రాష్ట్రంలోని సీసీ కెమెరాల్లో 40 శాతం వరకు పనిచేయడంలేదనే ప్రశ్నపై స్పందిస్తూ.. పోలీసు కమిషనర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో ఇతర రాష్ట్రాల నేరస్థులే ఎక్కువగా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నారని.. వారిని నియంత్రించేందుకు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశామని చెప్పారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details