ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెలలోనే రైతులకు అందనున్న వ్యవసాయ రుణాల వడ్డీ - రైతులకు జమకానున్న వ్యవసాయ రుణాల వడ్డీ

భారీ వర్షాలతో కుదేలైన రైతులకు.. కొంత ఉపశమనం కలిగించే వార్తను చెప్పారు వ్యవసాయ కమిషనర్ అరుణ్ కుమార్. గతేడాది తీసుకున్న వ్యవసాయ రుణాలకు.. 'సున్నా వడ్డీ' పథకం కింద వడ్డీని ఈనెలలో జమ చేయనున్నట్లు వెల్లడించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించి.. సరిగా పనిచేయని సిబ్బందిని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

interest reimbursement
సున్నా వడ్డీ పథకం

By

Published : Oct 17, 2020, 4:10 PM IST

వ్యవసాయ రుణాలకు సంబంధించిన వడ్డీని ఈనెలలో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. రైతులు గతేడాది బ్యాంకుల్లో తీసుకున్న మొత్తానికి వడ్డీని వారి ఖాతాల్లో వేయనున్నామని వెల్లడించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని రైతు భరోసా కేంద్రాన్ని ఆయన సందర్శించారు.

కౌలు రైతులకూ సున్నా వడ్డీ పథకం వర్తిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. సీసీఆర్సీ లేదా రైతు గ్రూపులకు స్థానిక ఈవో ఇచ్చే ధ్రువీకరణ పత్రం ద్వారా బ్యాంకు రుణం పొందవచ్చని తెలిపారు. తైవాన్ స్ర్పేయర్లు తక్కువ ధరకు అందించేందుకు.. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడతామని వివరించారు.

రైతు భరోసా కేంద్రం పనితీరు గురించి అన్నదాతలను అరుణ్ కుమార్ ప్రశ్నించగా.. పలు ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కార్యాలయంలోని కియోస్క్ యంత్రాన్ని పరిశీలించగా.. రైతుల వివరాలు అందులో నమోదు చేయలేదు. ఏవో విజయకుమార్, సిబ్బంది చర్యల పట్ల కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. సక్రమంగా పనిచేయకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన

ABOUT THE AUTHOR

...view details