తీవ్ర మనస్తాపంతో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో విషాదం నింపింది. చెరుకుపల్లికి చెందిన అన్నపరెడ్డి రాము (40), తిరుపతమ్మ (35) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రెండు నెలల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందింది. చిన్న కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది. పెద్ద కుమార్తె ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు ఎంతకూ కోలుకోలేకపోయారు. చివరికి ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
మిన్నంటిన రోదనలు...