ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 8, 2020, 7:14 PM IST

ETV Bharat / state

నిండు నూరేళ్లు తోడుగా ఉంటానన్నాడు... 15 ఏళ్లకే చంపేశాడు!

నిండు నూరేళ్లు తోడుంటనన్న భర్త... పెళ్లైన 15 ఏళ్లకే చంపేశాడు. మనస్పర్థలు కారణంగానే గొంతు పిసికి చంపినట్లు మృతిరాలి తండ్రి వాపోయాడు. చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి.. మళ్లీ సర్దుకుపోతారానుకున్నాం. కానీ చివరికి కట్టుకున్న వాడే కడతేరుస్తాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన గుంటూరులో జరిగింది.

నిండు నూరేళ్లు తోడుగా ఉంటానన్నాడు... 15 ఏళ్లకే చంపేశాడు!
నిండు నూరేళ్లు తోడుగా ఉంటానన్నాడు... 15 ఏళ్లకే చంపేశాడు!



మనస్పర్థల కారణంగా భార్యని భర్త గొంతునులిమి చంపేశాడు. ఈ ఘటన గుంటూరు తుఫాన్ నగర్​లో జరిగింది. గుంటూరుకి చెందిన వీరాంజనేయులుతో కృష్ణా జిల్లా కంచికచర్లకి చెందిన కొటేశ్వరితో 15 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరాంజనేయులు కార్పెంటర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి 8 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అయితే గత నాలుగు నెలలు నుంచి ఇరువురి మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి భార్యతో గొడవ పడిన వీరాంజనేయులు కోపంతో భార్యను ఒక్కసారిగా తోసేశాడు. అనంతరం గొంతు పిసికి చంపినట్లు మృతురాలి తండ్రి ప్రతాప్ తెలిపాడు. తన కూతురుని చంపిన అల్లుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టాభిపురం సీఐ పూర్ణచంద్రరావు తెలిపారు.

వీరాంజనేయులు ఇంటివద్ద గుమికూడిన జనం
మృతిరాలి బంధువులు

ABOUT THE AUTHOR

...view details