ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత తెదేపాకు లేదు: హోంమంత్రి - నారా లోక్​శ్​పై హోంమంత్రి సుచరిత ఆగ్రహం

ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం ఆమలవుతుందని తెదేపా నేత నారా లోకేశ్​ వ్యాఖలపై హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత తెదేపా నేతలకు లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

home minister sucharitha comments on nara lokesh
home minister sucharitha comments on nara lokesh

By

Published : Jan 29, 2021, 4:47 PM IST

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేసిన​ వ్యాఖ్యలను హోం మంత్రి మేకతోటి సుచరిత ఖండించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ నేతలకు లేదన్నారు. వైకాపా ప్రభుత్వం అంబేడ్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా.. బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తునట్లు చెప్పారు. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు. గుంటూరు నల్లచెరువులో ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొని.. అర్హులకు పట్టాలు అందజేశారు.

తెదేపా నేత నారా లోకేశ్​పై హోంమంత్రి వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details