ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాలోకి హితేష్, ఆమంచి

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావు కుమారుడు హితేష్ చెంచురామ్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి వైకాపాలో చేరారు.

By

Published : Feb 27, 2019, 4:26 PM IST

Updated : Feb 28, 2019, 11:08 AM IST

వైకాపాలోకి హితేష్, ఆమంచి

జగన్ సమక్షంలో చేరికలు

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావు కుమారుడు హితేష్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైకాపాలో చేరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైకాపా అధ్యక్షుడు జగన్..పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల తెదేపా నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావు గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన భార్య పురంధేశ్వరిభాజపాలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో తన రాజకీయ వారసుడుగా కుమారుడు హితేష్​ను దగ్గరుండి మరీ వైకాపాలో దగ్గుబాటిచేర్పించడం చర్చనీయాంశమైంది. హితేష్​కు పర్చూరు అసెంబ్లీ అభ్యర్థిత్వం ఖరారైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Last Updated : Feb 28, 2019, 11:08 AM IST

ABOUT THE AUTHOR

...view details