ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంగం డెయిరీ కేసులో మరో ఇద్దరికి బెయిలు మంజూరు - guntur latest news

సంగం డెయిరీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ అనిశా నమోదు చేసిన కేసులో నాలుగు, ఐదో నిందితులుగా ఉన్న కె.గోపినాథ్, పి.సాంబశివరావుకు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

Sangam dairy bail petition
సంగం డెయిరీ కేసు

By

Published : Jul 10, 2021, 3:37 AM IST

Updated : Jul 10, 2021, 4:02 AM IST

సంగం డెయిరీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ అనిశా నమోదు చేసిన కేసులో నాలుగు, ఐదో నిందితులుగా ఉన్న కె.గోపినాథ్, పి.సాంబశివరావుకు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఈ మేరకు ఆదేశాలిచ్చారు. అనిశా నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ సంగం పాల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ అప్పటి ఎండీ కె.గోపినాథ్, ముఖ్య ఆర్థికాధికారి పి.సాంబశివరావు ఇటీవల హైకోర్టులో బెయిలు కోసం పిటిషన్ వేశారు. ఆ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి బెయిలు మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.

Last Updated : Jul 10, 2021, 4:02 AM IST

ABOUT THE AUTHOR

...view details