గుంటూరు జిల్లా వినుకొండలో మున్సిపల్ అధికారులు చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్యలను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్డు ఉత్తర్వులతో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారు.
HIGH COURT: వినుకొండలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - వినుకొండ వార్తలు
గుంటూరు జిల్లా వినుకొండలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్డు ఉత్తర్వులతో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారు.
![HIGH COURT: వినుకొండలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు High Court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12442957-393-12442957-1626163921534.jpg)
హైకోర్టు
నేటి ఉదయం వినుకొండలోని సురేశ్ మహల్రోడ్డులో అక్రమ నిర్మాణాలను తొలగించటానికి మున్సిపల్ అధికారులు జేసీబీతో వెళ్లారు. సగానికి పైగా నిర్మాణాలను కూల్చివేశారు. కనీసం సామాన్లు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి