ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాదయాత్రలో నిరసనలకు తావులేకుండా పోలీసులే చూసుకోవాలి : హైకోర్టు - అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర

HIGH COURT : అమరావతి రైతుల పాదయాత్రలో కేవలం 600 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. వైకాపా నాయకులు పాదయాత్రను అడ్డుకుంటున్నారని రైతులు దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిపిన కోర్టు.. ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

HIGH COURT ON AMARAVTI FARMERS PETITION
HIGH COURT ON AMARAVTI FARMERS PETITION

By

Published : Oct 21, 2022, 2:19 PM IST

HIGH COURT ON AMARAVTI FARMERS PETITION : అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు ఇతరులు నిరసన తెలపకుండా పోలీసులే రక్షణ కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతోపాటు పాదయాత్రలో కేవలం 600 మంది మాత్రమే పాల్గొనాలని.. మద్దతు తెలిపేందుకు వచ్చేవారు రోడ్డుకు ఇరువైపులా ఉండి సంఘీభావం తెలపాలని హైకోర్టు ఆదేశించింది. పాదయాత్రను అడ్డుకుంటున్నారని అమరావతి పరిరక్షణ సమితి, రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. గతంలో పాదయాత్రకు ఏ వాహనాలకు అనుమతి ఉందో అవే ఉండాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details