ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Telugu Students In Manipur: మణిపూర్​లో తెలుగు విద్యార్ధులు.. తరలించేెందుకు సర్కార్​ రంగం సిద్ధం - Help Line For Students

Help Line For Telugu Students: మణిపూర్​లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్న ఘటనపై అత్యవసర హెల్ప్ లైన్​ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దిల్లీలోని ఏపీ భవన్ ద్వారా ఇంఫాల్​లో చిక్కుకున్న వారిని సహాయం అందిస్తామని ప్రకటించింది. 011-23384016, 011-23387089 హెల్ప్ లైన్​లు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేసింది. మణిపూర్​లో ఉన్న ఏపీ వాసుల సహాయం కోసం అక్కడి ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడుతున్నట్టు అధికారులు తెలిపారు.

Manipur
Manipur

By

Published : May 6, 2023, 10:51 PM IST

Help Line For Telugu Students: మణిపూర్‌లో అల్లర్లతో తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంఫాల్‌ ఎన్​ఐటీలోని 150 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉన్నారు. తాగునీరు కూడా సరిగాలేక... అధికారులు ఒకపూట మాత్రమే భోజనం అందిస్తుడంటంతో ఇబ్బందులు పడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ వసతిగృహాల్లో తలదాచుకుంటున్నవిద్యార్థులకు.. వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడే అవకాశం లేకుండా పోలీసులు జామర్లు పెట్టారు. సొంత రాష్ట్ర విద్యార్థులను వారి వారి ఇళ్లకు మణిపూర్ ప్రభుత్వం చేర్చింది. మిగిలిన ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం దిల్లీ లోని ఏపీ భవన్ ద్వారా ఇంఫాల్ లో చిక్కుకున్న వారిని సహాయం అందిస్తామని ప్రకటించింది. అలాగే 011-23384016, 011-23387089 హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేసింది. అయితే మణిపూర్‌లో నాలుగైదు రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో 54 మంది మృతి చెందారు. ఎన్​ఐటీ చుట్టూ బాంబుల మోతలతో... కంటిమీద కునుకు లేకుండా విద్యార్థులు భయం గుప్పెట్లో ఉన్నారు.

మణిపూర్‌ ఎన్‌ఐటీ క్యాంపస్‌లో చిక్కుకున్న 70 మంది రాష్ట్ర విద్యార్థులకు భద్రతగా ఎన్‌ఐటీ క్యాంపస్ చుట్టూ ఆర్మీ బలగాలు మోహరించాయి. అయితే ఎన్‌ఐటీ క్యాంపస్‌లో 5 రోజులుగా తాగునీటి కొరత ఉందని, అలాగే క్యాంపస్‌లో ఇంటర్నెట్ లేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని విద్యార్థులు కోరారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థులను తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. తెలంగాణ తమ విద్యార్థులను ఆదివారం విమానంలో తీసుకురానుంది. ఏపీ ప్రభుత్వం కూడా తమను త్వరగా స్వస్థలాలకు చేర్చాలని ఏపీ ప్రభుత్వానికి విద్యార్థుల వినతులు చేస్తున్నారు.

అసలు అల్లర్లకు కారణం ఏంటి..?:మణిపూర్‌ అట్టుడుకుతూ ఉండడానికి కారణం ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలే. దీని పూర్వాపరాలను పరిశీలిస్తే మణిపూర్‌ జనాభాలో గిరిజనేతరులైన మైతై వర్గం 53శాతం ఉంటారు. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ నుంచి వస్తున్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎస్టీ హోదా కల్పించాలని గత కొంత కాలంగా వారు డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం మణిపూర్‌లోని పర్వత ప్రాంతాల్లో నివసించేందుకు మైతై వర్గానికి అనుమతి లేదు. ఎస్టీ హోదా కల్పించాలన్న వారి డిమాండ్‌పై కేంద్రానికి నాలుగు వారాల్లో సిఫార్సులు పంపించాలని మణిపూర్‌ హైకోర్టు గత నెలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్టీ హోదాకు మైతై వర్గం డిమాండ్‌ చేయడానికి వ్యతిరేకంగా మణిపూర్ గిరిజన విద్యార్ధి సంఘం గిరిజన సంఘీభావ యాత్రను నిర్వహించింది. ఇందులో వేలాది మంది పాల్గొన్నారు. ఈ ఆందోళనలతోనే హింస చెలరేగింది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ప్రాణ నష్టం వివరాలు స్పష్టంగా తెలియకున్నా ఆస్తులకు మాత్రం విపరీతంగా నష్టం జరిగింది. ఆందోళనకారులు ఇళ్లు, ఆస్తులకు నిప్పుపెట్టారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో సీఆర్​పీఎఫ్ మాజీ డీజీ కుల్దీప్‌సింగ్‌ను భద్రతా సలహాదారుగా నియమించుకుంటూ మణిపూర్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details